న్యూ లుక్ కోసం 'బన్నీ' కసరత్తులు !
'అల వైకుంఠపురములో'.. ఫస్ట్ లుక్ పోస్టర్ తో వచ్చిన బన్నీ, తన స్టైలిష్ లుక్ తో మొత్తానికి అభిమానులను ఫిదా చేశాడు. కాగా ఈ సినిమా తరువాత షెడ్యూల్ కోసం చిత్రబృందం అతి త్వరలో పారిస్ కు వెళ్ళబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని రెండు సాంగ్స్ ను పారిస్ లో తీయనున్నారని తెలుస్తోంది. అయితే ఈ సాంగ్స్ కోసం బన్నీ న్యూ లుక్ లో కనిపిస్తాడట. ఇప్పటికే న్యూ లుక్ బన్నీ కసరత్తులు కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా టీజర్ ను మొదట నవంబర్ 7న త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయనున్నా ఆ తరువాత మనసు మార్చుకుని.. అక్టోబర్ 8న దసరా స్పెషల్ గా ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఇక వచ్చే సంక్రాంతికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని సన్ నెక్స్ట్ సంస్థ దక్కించుకోగా.. శాటిలైట్ హక్కుల్ని జెమినీ టీవీ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఏమైనా ఈ రెండు సంస్థలు కూడా ఈ సినిమా రైట్స్ కోసం భారీ ఎమౌంట్ వెచ్చించాయని సమాచారం. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ కావడంతో సినిమా పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. పైగా ఇప్పటికే 'జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి' సినిమాలతో హిట్ అందుకున్న త్రివిక్రమ్ - బన్నీ, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి పర్ ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నారు.
అందుకే ఈ చిత్రానికి ఓ రేంజ్ లో శాటిలైట్ అండ్ డిజిటల్ హక్కుల్ని అమ్మారు. ఇక ఈ చిత్రంలో బన్నీ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. పూజా హెగ్డే ఇప్పటికే డీజే సినిమాలో బన్నీ సరసన నటించింది. అలాగే ఈ సినిమాలో సుశాంత్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఒకప్పటి హాట్ హీరోయిన్ టబు కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా తమన్ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ మరియు హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమాకి తమన్, ట్యూన్స్ అన్ని ఇచ్చేశాడట. బన్నీ డాన్స్ మూమెంట్స్ కి తగట్లు ట్యూన్స్ అద్భుతంగా వచ్చాయని.. ముఖ్యంగా మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ ఇచ్చేలా సినిమాలో ఓ మాస్ సాంగ్ ఉండబోతుందని తెలుస్తోంది.